Monday, May 20, 2013

పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర పెడతారో వారిమాటే చల్లుతుందా ?

మనష్యుల శ రీరంలో విద్యుత్ దాగి వుంటుంది. అదే జీవ శక్తి వివాహ సమయంలో ఎవరు ముందుగా జీలకర్ర, బెల్లం తలపై పెడతారో వారి శక్తి అవతల శక్తిపై పడుతుంది. ఆ ప్రవాహ శక్తి జీవితాంతం పనిచేస్తుంది.
అందుకే కొంత మంది ఇంట ముందుగా జీలకర్ర, బెల్లం పెట్టిన వారిమాటే చెల్లుబాటు అవుతుంది. సంప్రదాయంగా అయితే పెళ్లి కూతురితో ముందు పెట్టిస్తారు.

*****కొత్త పెళ్ళికూతురిచే అత్తవారింట అడుగుపెట్టినప్పుడు సింహ ద్వారం వద్ద బియ్యాన్ని పెట్టి ఎందుకు దోర్లిస్తారు?
నూతన దంపతులు అత్తగారింటికి వచ్చినప్పుడు రాగి పాత్రలో బియ్యం పోసి సింహ ద్వారం మీద పెట్టి , కొత్త పెళ్ళికూతుర్ని ఆ బియ్యపు పాత్రను తన్ని ముందుగా కుడి కాలు పెట్టి లోపలి రమ్మంటారు.
ధాన్యలక్ష్మిని తన్నటం తప్పే. అయిన పెళ్ళికూతురు తన్నిన బియ్యం ఎంత దూరంగా పడి విస్తరిస్తే అంత ప్రదేశం మేర ఆ కుటుంబంలో ధాన్యలక్ష్మి తాండవిస్తుందని అలా చేయిస్తారు. ఇది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఆచారం.

****కన్య దానం వల్ల వచ్చే ఫలితం ఏమిటి?
వివాహంలో వివాహ తంతును నిర్వహించే వధువు తల్లితండ్రి, వరుని తల్లితండ్రి జనక మహారాజు, దశరధ మహారాజు దంపతులతో సమానం. వారు ఆ వివాహ తంతును జరిపించటం ద్వారా, కన్యా దానం వల్ల కన్య తల్లి తండ్రికే కాక అటు పదితరాలు, ఇటు పదితరాల వారికి బ్రహ్మలోకంలో పుణ్యం సిద్దిస్తుంది.

***** కొత్త పెళ్లికూతురు తెల్ల చీర, మల్లె పూలు పెట్టుకోవటంలో పరమార్దం ?
మల్లె పువ్వులో సుగంధ పరిమళం ఎక్కువ. ఈ వాసనా ఎలాంటి వారికైనా కామపు కోర్కెలని తెప్పిస్తుంది. భార్య భర్తల మధ్య ఉండే చిన్న చిన్నభేదాలు తొలగి భార్యపై ఇష్టాన్ని, మమకారాన్ని పెంచి పెద్దది చేస్తుంది.
ఈ మల్లె పూల వాసనా శరీరాన్ని కుదురుగా ఉంచటమే కాకుండా వాతాన్ని తగ్గించి , రక్తంలో ఉండే దోషాలను పోగొట్టి , పుట్టే సంతానం ఆరోగ్యంగా పుట్టేందుకు దోహదపడుతుంది.

****వదువరులతో ఒకరి కాలివేలి బొటన వేలిని మరొకరి చేత ఎందుకు తోక్కిస్తారు?
ఇరువురి శరీరాల్లో ప్రాణ శక్తిని అనగా విద్యుత్ ని ఒకరి శరీరంలోకి ఒకరు పంపించే ప్రక్రియే ఆ తంతు.
ఆ చర్యలో ఇద్దరి మనసులు కలిసి, ఒకేమాటగా ఒకేబాటగా నడచి ఇరువురు ఒక్కటవ్వాలని పరమార్దం. కాలి బొటన వేలి ద్వారా ఉండే నరాలు విద్యుత్ ని గ్రహించే శక్తి కలిగి ఉంటాయి.

No comments:

Post a Comment