Sunday, December 20, 2020

స్కందోత్పత్తి

స్కందుడు



సుబ్రహ్మణ్యుని చేతిలో ఉన్నటువంటి ఆయుధము శక్త్యాయుధము అని చెప్పబడుతున్నది. అందుకే "ప్రథమో జ్ఞాన శక్త్యాత్మా" - పైగా దానికి జ్ఞాన శక్త్యాయుధమని పేరు. అంటే ఆ ఆయుధంలో రెండు విశేషములున్నాయి. జ్ఞానము, శక్తి రెండు చెప్పబడుతున్నాయి. అసలు జ్ఞానానికే పెద్ద శక్తి ఉంది. ఎంతటి శక్తి ఉంది అంటే ఎవరూ ఛేదించలేని అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానముయొక్క శక్తి. అలా జ్ఞానశక్తి ఆయనయొక్క ఆయుధం. ఇది భావన చేసినప్పుడు ఆయన గురుస్వరూపంగా కనిపిస్తాడు.


అసుర సంహారం చేసినటువంటి మహా ప్రతాపమూర్తి. "సేనానీనాం అహం స్కందః" అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాట. సేనానులలో స్కందుడు. స్కందుడు అని సుబ్రహ్మణ్యునికి మరొక పేరు. చెల్లాచెదురైనటువంటి దేవసేనలన్నింటినీ సమీకరించి వారందరికీ తాను బలమై, బలాన్ని ఇచ్చి నడిపించి అసుర శక్తులను సంహరించాడు. అందుకే ఎప్పుడైనా సరే కాలంలోనూ, దేశంలోనూ ప్రపంచాన్ని బాధించే అసుర శక్తులు ఉన్నవేళ సుబ్రహ్మణ్య ఆరాధన గానీ చేసినట్లయితే వెంటనే అసుర శక్తులు తొలగి దేశానికీ, కాలానికీ, వ్యక్తికీ కూడా క్షేమం లభిస్తుంది. అలాంటి క్షేమం కావలసినటువంటి వారు సుబ్రహ్మణ్యారాదన విశేషంగా చేయాలి. దీనివల్ల బాధించె శక్తులు తొలగుతాయి. అందుకు ప్రత్యేకించి దేవతలందరూ కూడా దేవసేనాపతి ఆవిర్భావానికి తపన పడ్డారు. శివశాక్త్యాత్మకంగా ఆవిర్భవించాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన ఆవిర్భావంతో దేవతలందరికీ బలం వచ్చింది. అసలు బలమే ఆయనయొక్క స్వరూపం. అందుకే సేనాని అయ్యాడు. అందుకు లోక క్షేమంకరమైన ఉత్తమ శక్తులు చెల్లాచెదురై బలం తగ్గినప్పుడు వాటన్నింటికీ బలాన్నిచ్చి నడిపించేటటువంటి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకు గొప్ప నాయకుడు కూడా ఈయన. అలాంటి సేనానిగా ఎవరైతే నమస్కరిస్తారో వారికి మొత్తం దేవతా సమూహం అంతా కూడా రక్షణ చేస్తుంది.






🌺1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా!

సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!!


🌺2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్!

ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!!


🌺3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా!

తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!!


🌺4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా!

సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!!


🌺5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః!

సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!!


🌺6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు!

తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!!


🌺7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః!

జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!!


🌺8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్!

ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!!


🌺9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన!

ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!!


🌺౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్!

అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!!


🌺౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన!

శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!!


🌺12. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః!

గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్!!


🌺౧౩. తస్యతద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్!

దృష్ట్వా తన్మహిమానం శ సమంతాదవకీర్యత!!


🌺౧౪. సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః!

సర్వస్రోతా౦సి పూర్ణాని గంగాయా రఘునందన!!


🌺౧౫. తమువాచ తతో గంగా సర్వ దేవా పురోహితం!

అశక్తా ధారణే దేవా తవ తేజస్సముద్ధతం!

దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా!!


🌺౧౬. అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః!

ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతామ్!!


🌺౧౭. శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం!

ఉత్ససర్జ మహాతేజః స్రోతోభ్యో హాయ్ తదానఘ!!


🌺౧౮. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం!!


🌺౧౯. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం!

తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత!!


🌺౨౦. మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ!

తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత!!


🌺౨౧. నిక్షిప్తమాత్రే గర్భే టు తేజోభిరభిరంజితం!

సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్!!


🌺౨౨. జాత రూపమితి ఖ్యాతం తదాప్రభ్రుతి రాఘవ!

సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం!

తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం!!


🌺౨౩. త౦ కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః!

క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్!!


🌺౨౪. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం!

దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః!!


🌺౨౫. తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్!

పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః!!


🌺౨౬. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే!

స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్!!


🌺౨౭. స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్!

కార్తికేయ౦ మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్!!


🌺౨౮. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్!

షన్ణా౦ షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః!!


🌺౨౯. గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా!

అజయత్


వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః!!


🌺౩౦. సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం!

అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః!!


🌺31. ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా!

కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ!!


🌺౩౨. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః!

ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్!!

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రి౦శస్సర్గః!!🌺


🌺గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.🌺


నేడు స్కంద షష్ఠి, స్కంద షష్ఠి అనగా ఏమి?


 స్కంద షష్ఠి అనగా ఏమి? ఆరోజు ఏం చేస్తారు.. ఏం చేస్తే శుభం కలుగుతుంది?* 🌺 శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు.


🌺 దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు.


🌺 కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది.


🌺 పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న "తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు.


🌺 అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు.


🌺దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు.


🌺 దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు.


🌺 ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.


🌺 ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తీకేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు.


🌺 కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.


🌺 అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.


🌺 సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" గా పిలుచుకుంటున్నాము, "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.


🌺 ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.


🌺 ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.


🌺 ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది.


🌺 తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది.


🌺 షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం.


🌺 ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది.


🌺 ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది.


🌺 నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది.


🌺 మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని, ఆర్ధిక ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని, దానం చేయమని సందేశం ఇస్తుంది.


🌺 ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోప కారం మిధం శరీరం" అని భావించి పేదవారికి  కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను, తిను బండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి. 

...



నన్నెం శ్రీహర్ష శర్మ - స్మార్త భట్టారక

శ్రీ సుబ్రహ్మణ్య కరావాలంబ స్తోత్రం


శ్రీ సుబ్రహ్మణ్య కరావాలంబ స్తోత్రం *




హే స్వామినాథ కరుణాకర దీనబంధో,

శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |

శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||


దేవాదిదేవనుత దేవగణాధినాథ,

దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |

దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||


నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,

తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |

శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||


క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,

పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |

శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||


దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |

శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||


హారాదిరత్నమణియుక్తకిరీటహార,

కేయూరకుండలలసత్కవచాభిరామ |

హే వీర తారక జయాౙ్మరబృందవంద్య,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||


పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,

పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||


శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,

కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |

భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||


సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |

తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |

సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |

కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||


ఓం శ్రీ సుబ్రమణేశ్వర స్వామియే నమో నమః 🙏



మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి, అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. మీకు తెలిసిన పెద్దవారికి, దర్శించే వీలు లేని వారికి చూపించండి, ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.


నన్నెం శ్రీహర్ష శర్మ - స్మార్త భట్టారక

Wednesday, December 09, 2020

భోజన మంత్రములు


 భోజనము చేయునపుడు ఆచరించవలసినవి



ముందుగా కాళ్లూ,చేతులు, నోరు శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన వలెను. భగవంతుని స్మరించ వలెను.


శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .


శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే

ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ. 


శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః

ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.


ఓం నమో నారాయణాయ.


ఔపోశనము ( భోజనమునకు ముందు )


ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.


అని గాయత్రీ మంత్రమును చదువుతూ నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ పదార్థమును ఆవహించి యున్న భూతములు తొలగి పోతాయి.

తరువాత ఎడమచేతి మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.


సత్యంత్వర్తేన పరిషించామి ( సూర్యాస్తమయము తరువాత అయితే - ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి నీటిని అన్నము చుట్టూ సవ్యముగా పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని


ధర్మ రాజాయ నమః

చిత్రగుప్తాయ నమః

ప్రేతెభ్యో నమః


అనుచు బలులను తూర్పు అంతముగా సమర్పించవలెను.

అరచేతిలో నీటిని తీసుకోని

అమృతమస్తు. అని అన్నమును అభిమంత్రించ వలెను.

అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.


కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది మంత్రమును చెప్తూ పంటికి తగుల కుండ మ్రింగ వలెను.


ఓం ప్రాణాయ స్వాహా.

ఓం అపానాయ స్వాహా.

ఓం వ్యానాయ స్వాహా.

ఓం ఉదానాయ స్వాహా.

ఓం సమానాయ స్వాహా.

ఓం బ్రహ్మణే స్వాహా. 


మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని పంచప్రాణములు కలవు. ఆ పంచ ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము. పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది. 


తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును ముగించవలెను.  


ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )

  నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి. అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది మంత్రమును చదువుతూ అపసవ్యముగా ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ పొయ్యవలెను.


రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు.

అనంతరము కాళ్లూ , చేతులు, నోరు శుభ్రపరచుకొని ఆచమనము చేయ వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి రెండు కళ్లను తుడుచు కొన వలెను. ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా కంటి దోషాలు తొలగి పోతాయి.


తతః శత పదాని గత్వా - వంద అడుగులు వేయవలెను. తరువాత


అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం జరయంత్వశేషమ్. 

సుఖం మమైతత్ పరిణామ సంభవం యచ్చ త్వరోగోర మమచాస్తు దేహః.


అంటూ పొట్టను ముమ్మారు నిమర వలయును. తద్వారా ఆహారము చక్కగా జీర్ణమగును.


నన్నెం శ్రీహర్ష శర్మ- స్మార్తభట్టారక