pdf download here
వినాయక వ్రత విధానము
వినాయక శ్లోకం:
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం
చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప
శాంతయే|
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే||
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు
సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః
{అని నమఃస్కారం చేసుకోవాలి}
ఏకాహారతి వెలిగించాలి:
{ఏకాహారతి వెలిగించి దానికి పసుపు,
కుంకుమ, అక్షంతలు,
పూల తో అలంకరించవలెను.}
దీపారాధన వెలిగించేటప్పుడు శ్లోకం:
{యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును
ఏకాహారతితో దీపం వెలిగించాలి.}
భోదీప దేవి రూపస్త్వం,
కర్మ సాక్షిహ్య విఘ్ణకృత్,
యావత్ పూజాం కరిష్యామి,
తావత్వం సుస్థిరో భవ.
దీపారాధన ముహూర్తః సుమూహూర్తోస్తు
{పై శ్లోకం చదువుకుంటూ దీపారాధన కుంది
కి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలతో పూజ చెయ్యాలి.}
ఆచమనం:
{చెయ్యి కడుగుకోవాలి}
ఓం కేశవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
{మళ్లీ చెయ్యి కడుగుకోవాలి}
ఓం గోవిందయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}
{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను
పఠించవలెను}
కేశవనామాలు:
ఓం గోవిందాయ నమః , ఓం విష్ణవే నమః, ఓం మధుసూధనాయ నమః , ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః , ఓం శ్రీధరాయ నమః , ఓం రిషీకేసాయ నమః , ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః , ఓం సంకర్షణాయ నమః , ఓం వాసుదేవాయ నమః , ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః , ఓం పురుషోత్తమాయ నమః , ఓం అదోక్షజాయ
నమః , ఓం నరసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః , ఓం జనార్ధనాయ నమః , ఓం ఉపేంద్రాయ నమః , ఓం హరయే శ్రీకృష్ఱాయ నమః
భూశుద్ధి:
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
{ప్రాణాయామము చేసి అక్షంతలను వెనుక
వేసుకోవలెను.}
ప్రాణాయామం:
ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య
ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
||ఓమా పోజ్యోతీరసోమృతం
బ్రహ్మభూర్భువస్సువరోమ్||
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
యః స్మరేద్వై విరూపాక్షంస
బాహ్యాభ్యంతరశ్శుచిః ||
(అని నాలుగు దిక్కులా ఉద్ధరని తో నీళ్ళు
చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా.)
సంకల్పం:
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ
పరమేశ్వర ప్రీత్యర్ధం
(కులదైవాన్ని సంభోదించుకోవాలి
"పరశ్వరుని" బదులుగా)
శుభేశోభనే ముహూర్తే - శ్రీ మహావిష్ణో
రాజ్ఞయా
ప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణః
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే
ప్రథమపాదే - జంబూద్వీపే
భరతవర్షే -భరతఖండే
(India లో వుంటే "భరతఖండే" అని
చదవాలి, U.S లో వుంటే "యూరప్ఖండే"
చదవాలి)
మేరోః దక్షిణ దిగ్భాగే
(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని
చదవాలి)
(శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా /
గంగా / గోదావర్యోః మధ్యదేశే" )
కావేరి నదీ సమీపే
నివాసిత గృహే
(Own house అయితే "సొంత గృహే"అని
చదవాలి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక
చాంద్రమానేన
శ్రీ ఖర నామ సంవత్సరే
ఉత్తరాయనే
(దక్షిణాయనే from 17th july / ఉత్తరాయనే from 15th jan --- -[6 months కి ఒక సారి మారుతుంది.
గ్రీష్మ ఋతువే
('గ్రీష్మ ఋతువే' - 'Summer
Season' / 'వర్ష ఋతువే' - 'Rainy Season' / 'వసంత ఋతువే' - 'Winter Season')
జ్యేష్ఠ మాసే
(తెలుగు నెల)(శ్రావణ, చైత్ర, జ్యేష్ఠ, )
శుక్ల పక్షే
(శుక్ల పక్షం [as the size of
the moon increases] / బహుళ పక్షం [as the size of the
moon decreases], కృష్ణ పక్షం)
________ తిధౌ
(సూర్యోదయానికి ఏ తిథి start అయితే ఆ తిథే చదువుకోవాలి)
(Ex: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షస్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ or అమావాస్య.)
________ వాసరే
(ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి Ex:
ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని.)శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరుణే,ఏవం గుణవిశేషణ విశిష్టాయాం,
శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రా
(Ex: భారద్వాజస )
అహం __________ నామ ధేయా
(భర్త పేరు చదువు కోవాలి)
ధర్మ పత్ని ______________ నామ ధేయా,
(Ex: శైలజ)
సకుటుంభాయాః సకుటుంబస్య - ఉపాత్త
దురితక్షయ ద్వారా,
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం,
క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య
ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,
ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల
పురుషార్ధ సిద్ధ్యర్ధం,
సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం,
సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార
పూజాం కరిష్యే,
{అని చదివి అక్షంతలు నీరు కలిపి
పళ్ళెములో విడువవలెను.}
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి
వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం
షోడశోపచారపూజ:
ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం,
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ
ఆవాహయామి
మౌక్తికైః పుష్యరాగైశ్చ
నానారత్నైర్విరాజితం
రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి
గృహ్యాతాం॥
ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ
పుష్పాక్షతైర్యుతం ॥
ఆర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥
పాద్యం సమర్పయామి
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత
గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥
ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన
సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే
॥
మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥
పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః
స్నానం కురుష్వభగవానుమాపుత్ర
నమోస్తుతే॥
శుద్దోదక స్నానం సమర్పయామి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥
వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో
త్తరీయకం
గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥
ఉపవీతం సమర్పయామి.
చంద నాగరు కర్పూర కస్తూరీ
కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం
ప్రతిగృహ్యాతాం॥
గంధాన్ సమర్పయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్
శాలీయాంస్తండులాన్ శుభాన్,
గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥
అక్షతాన్ సమర్పయామి.
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ
ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
పుష్పాణి పూజయామి.
అథాంగ
పూజ:
(పుష్పములతో పూజించవలెను)
గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి
హేరంబాయ నమః - కటిం పూజయామి
లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
గణనాథాయ నమః - నాభిం పూజయామి
గణేశాయ నమః - హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని
పూజయామి
ఏకవింశతి
పత్రపూజ:
(21 విధముల పత్రములతో పూజింపవలెను)
సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।
గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం
పూజయామి।
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,
వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం
పూజయామి,
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,
సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి
పూజయామి.
శ్రీ
వినాయక అష్టోత్తర శత నామ పూజా:
ఓం గజాననాయ నమః , ఓం గణాధ్యక్షాయ నమః , ఓం విఘ్నరాజాయ నమః , ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః , ఓం ద్విముఖాయ నమః , ఓం ప్రముఖాయ నమః , ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః , ఓం సుప్రదీప్తాయ నమః , ఓం సుఖనిధయే నమః
, ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః , ఓం మహాగణపతయే నమః , ఓం మాన్యాయ నమః , ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః , ఓం హేరంబాయ నమః , ఓం లంబజఠరాయ నమః , ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః , ఓం ప్రాజ్ఞాయ నమః , ఓం ప్రమోదాయ నమః , ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః , ఓం విఘ్నహంత్రే నమః , ఓం విశ్వనేత్రే నమః , ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః , ఓం వాక్పతయే నమః , ఓం శృంగారిణే నమః , ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః , ఓం శీఘ్రకారిణే నమః , ఓం శాశ్వతాయ నమః , ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః , ఓం భక్తనిధయే నమః , ఓం భావగమ్యాయ నమః , ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః , ఓం మంత్రకృతే నమః , ఓం చామీకర ప్రభాయ నమః , ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః , ఓం సర్వకర్త్రే నమః , ఓం సర్వ నేత్రే నమః , ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః , ఓం పార్వతీనందనాయ నమః , ఓం ప్రభవే నమః ,
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః , ఓం కాంతిమతే నమః , ఓం ధృతిమతే నమః , ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః , ఓం బ్రహ్మచారిణే నమః , ఓం బ్రహ్మరూపిణే
నమః , ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః , ఓం మహావీరాయ నమః , ఓం మంత్రిణే నమః , ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః , ఓం జ్యాయసే నమః , ఓం యక్షికిన్నరసేవితాయ నమః , ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః , ఓం గంభీరనినదాయ నమః , ఓం వటవే నమః , ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః , ఓం అభీష్టవరదాయ నమః , ఓం మంగళప్రదాయ నమః , ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః , ఓం పూష్ణే నమః , ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ఓం
అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః , ఓం అపాకృతపరాక్రమాయ నమః , ఓం సత్యధర్మిణే
నమః , ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః , ఓం సరసాంబునిధయే నమః , ఓం మహేశాయ నమః ,
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః , ఓం సమస్తదేవతామూర్తయే నమః , ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః ,
ఓం విష్ణువే నమః , ఓం విష్ణుప్రియాయ నమః , ఓం భక్తజీవితాయ
నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః , ఓం సతతోత్థితాయ నమః , ఓం విష్వగ్దృశేనమః , ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః , ఓం ఉన్మత్తవేషాయ నమః , ఓం పరజయినే నమః ,
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః , ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః.
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం,
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥
ధూపమాఘ్రాపయామి॥
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం
మయా,
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపందర్శయామి।
సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్,
నైవేద్యం గృహ్యతాంచణముద్దేః
ప్రకల్పితాన్,
భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ,
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,
నైవేద్యం సమర్పయామి।
సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ,
భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ
వినాయక
సువర్ణపుష్పం సమర్పయామి.
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం,
కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం
ప్రతిగృహ్యతాం
తాంబూలం సమర్పయామి।
ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం
నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
నీరాజనం సమర్పయామి।
అథ
దూర్వాయుగ్మ పూజా:
గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం
పూజయామి।
ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం
పూజయామి।
కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః
దూర్వాయుగ్మం పూజయామి।
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।
నమస్కారము, ప్రార్థన:
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ
నమస్తే విఘ్ననాశన,
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక
గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం
పాపనాశన,
పునరర్ఘ్యం సమర్పయామి,
ఓం బ్రహ్మవినాయకాయ నమః
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు
సర్వదా.
శ్రీ
వినాయక వ్రత కథ
సూతమహర్షి శౌనకాది మునులకు
ఇట్లు చెప్పెను।
గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే
శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి
కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।
భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి
చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది,
జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై
విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము
ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు।
గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి
కావలయునో కోరుకో" అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని
నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు
అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న
శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా
యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును
నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును
నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి
కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును
తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।
అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని
పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ,
స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన
నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన
బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె
తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది। ఆ దివ్యసుందర బాలుని
వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।
శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక
నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని
శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।
జరిగిన దానిని విని పార్వతి
విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని
మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల
ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని
వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:
గణేశుడు అగ్రపూజనీయుడు
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత
గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది।
శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ
పోటీ పెట్టినాడు। "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా
నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా
సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన
ఫలదాయకమగు ఉపాయమర్థించినాడు। వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు
అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే
వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।
చంద్రుని పరిహాసం:
గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన
చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।
(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా
లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు।
ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో
నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు
అవుతారు। నిందలకు గురియగుతారు।
చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా
శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము
నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై
ఉపాయము సూచించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని
అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు.
ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది.
దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత
స్పష్టము చేయబడినది.
శ్యమంతకోపాఖ్యానము:
చంద్ర దర్శనం నీలాపనింద:
ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ
కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించినది. దాని దుష్ఫలితము ఆయనకు
తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు.
దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని
వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించినాడు. ఆ విషయము సత్రాజిత్తునకు
సూచించినాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.
అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు
ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి
నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి
మణిని నోటకరచుకొని పోయినది.
నిజము తెలియని సత్రాజిత్తు మణి
ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.
ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి
ఆవశ్యకమైనది.
అడవిలో అన్వేషణ సాగించినాడు. ఒకచోట
ప్రసేనుని కళేబరము కనిపించినది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి
వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి.
శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక
బాలికకున్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని
అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం
సాగింది ఓక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి
క్షీణించజొచ్చింది.
అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు
శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక
నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క
శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని
దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము
చేయనారంభించినాడు.
అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము.
ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా
అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్దమును కోరినాడు.
అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక
జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ
ద్వంద్వ యుద్దము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము
శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ
వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి
పొందాడు జాంబవంతుడు.
శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు
వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము
తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను
శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి
సత్యభామను స్వీకరించాడు.
వినాయక వ్రతము చేయక చంద్రబింబమును
చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల
పరమదయాళువై భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను
అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో
శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా
భయముండదని లోకులకు వరము ఇచ్చినాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట
సాంప్రదాయమయినది.
పూజచేసి కథనంతయు విను అవకాశము
లేనివారు...
సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతాః
ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః
సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును
జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై
శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడినది. ఇది
జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.
సర్వేజనాః
సుఖినో భవంతు.
విఘ్నేశ్వర చవితి పద్యములు:
ప్రార్థన :
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు
వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల
మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల
నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు
మ్రొక్కెదన్.
తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్
అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్.
వినాయక మంగళాచరణము:
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును
బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం
వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు
కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని
దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం
శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు
భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు
కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం
ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు
కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ
దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం
చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర
తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు
బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్.
మరొక
పద్యం కూడా విద్యార్ధులకు ఉచితమైనది.
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!
ఇక
వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకము
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
మీ నన్నెం శ్రీహర్ష శర్మ
(స్మార్త
భట్టారక
బిరుదాంకితులు)