విమాన వెంకటేశ్వరస్వామి
ఒక విజయనగర రాజు,స్వామివారి ఆభరణాలను ధరించిన 9మంది అర్చకులను విచక్షణారహితంగా దేవాలయంలోనే నరికివేయగా ఆ దోషాన్ని నివృతి చేయడానికి వ్యాసరాయలువారు పన్నెండు సంవత్సరాలు ఎవ్వరినీ గర్భగుడిలోనికి అనుమతించకుండా లోపలనే వుండి పూజలు చేసారంట. అలా గర్భగుడి తలుపులు మూసే ముందు దూరప్రాంతాల నుండి వచ్చేభక్తులకు అసౌకర్యం కలగకూడదన్న వుద్దేశ్యం తో మూలవిరాట్టుకు ప్రతిరూపంగా వేరొక విగ్రహాన్ని ఆనందనిలయవిమానం మెదటి అంతస్థులో ఉత్తరవాయువ్యం మూల ప్రతిష్టించారు. అప్పుడు మెదలై నేటికీ కొనసాగుతూ, స్వామి దర్శనం అనంతరం విమానవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక ఆచారముగా మారింది.
మీ నన్నెం శ్రీహర్షశర్మ